Pages

Menu Bar

RT

Wednesday, February 18, 2015

General Knowledge Telugu Audio mp3 Download







Previous page
  • Track 31 GK for Comp.Exams mp3 Download
  • Track 32 GK for Comp.Exams mp3 Download
  • Track 33 GK for Comp.Exams mp3 Download
  • Track 34 GK for Comp.Exams mp3 Download
  • Track 35 GK for Comp.Exams mp3 Download

Next Page

Tags:general knowledge in telugu pdf free download  telugu general knowledge books free download  general knowledge telugu audio download  telugu mp3 free downloading songs  general knowledge questions and answers in telugu  general knowledge in telugu medium  general knowledge in telugu 2015pdf  general knowledge in telugu 2015,Searches related to telugu study mp3 free download  telugu mp3 free downloading songs  telugu wap mp3 free downloads  appsc study material in telugu free download  study mp3 free download  telugu study material in pdf  telugu mp3free download

Wednesday, February 13, 2013

Free Microsoft Excel Games Download

Tags:Free Microsoft Excel Games Download,Excel Games Download. Microsoft Excel Download.Tetris.xls - 89 KB   Download  Square.xls - 34 KB   Download  Mini+Pool.xls - 211 KB    Download  Fall+Out.xls - 92 KB    Download  Chopper+Challenge.xls - 63 KB   Download  bingo5x5-v2.xls - 51 KB    Download  Demon.xls - 42 KB  Download





Tetris.xls - 89 KB   Download


Square.xls - 34 KB   Download



Mini+Pool.xls - 211 KB    Download



Fall+Out.xls - 92 KB    Download



Chopper+Challenge.xls - 63 KB   Download



bingo5x5-v2.xls - 51 KB    Download



Demon.xls - 42 KB  Download




Wednesday, January 23, 2013

Dietcet 2012 Seat Allotment Order – TTC 2012 Allotment order Download


DED 2012 Allotment order download on 19 January to 21 January  dietcet.cgg.gov.in ..
Dietcet 2012 Seat Allotment Order is for admission into D.Ed. Course for the academic year 2012-13.DED 2012 course means Diploma in Education, District institutes of education and training (diet) /Elementary teacher training institutes Common entrance test web options actual schedule is 02.12.2012 but the response from qualified candidates is poor due to this reason Dietcet 2012 web options process is extended up to 04.12.2012 up to 5 PM. The Last date for submission of web based preferences for admission into D.Ed. Course is extended up to 04.12.2012. All these are concluded Please submit preferences if your rank is below the maximum permissible ranks.all the counselling process is over

Dietcet 2012 Seat Allotment Order
Dietcet 2012 First phase web options process last date is today, TTC 2012 Allotment order for DED 2012 course means Diploma in Education courses in 177 colleges has nearly 9050 seats. Dietcet 2012 Seat Allotment Order will be announced from 05.12.2012-09.12.2012.Dietcet 2012 certificates verification is starts from 13.12.2012-17.12.2012. Last date to join or take admission in allotted DED colleges on or before 20.12.2012. DED 2012 classes starts from 20.12.2012.

Dietcet 2012 Second Phase web counseling for remaining seats in Diploma in Education courses starts from 26.12.2012, yesterday means 03.12.2012 Primary Education department has announced the 38 private ded colleges also starts classes to the courses of Diploma in Education from 2013 year so new colleges are also added from Dietcet 2012 Second Phase web counseling.

Dietcet 2012 Important Dates and schedule:
TTC 2012 first phase counseling is over on 04.12.2012 at 5 PM.
TTC 2012 Allotment order Download from 19 January to 21 January 
Dietcet 2012 certificates verification is starts from 13.12.2012-17.12.2012
Last to join colleges of DED courses is 20.12.2012
DED 2012 classes starts from 20.12.2012
Dietcet 2012 Second Phase web counseling from 26.12.2012
TTC 2012 Allotment order/ DED 2012 Allotment order Download http://dietcet.cgg.gov.in/

Friday, January 18, 2013

Computer Tips,

Tags:Free Computer Tips and Tricks. free computer - tips.com provide all the tips regarding computers absolutely free,computer tips pdf , computer tricks  computer tips and tricks  basic computer tips  internet tips  computer tips of the day , windows xp tips  ,bangla computer tips




How to Change DNS?
Goto
=>Control Panel
           =>Network Connection
         =>Local Area network
                                     =>TCP/IP          -Right Click Properties
=>Edit DNS now





How 2 add password to files & folders on computer?
>Right click
>new
>Compressed folder
>paste file in to folder
>Right click add password




A Best Trick 2 Erase Ur PC
HARD DISK ERROR
&
Keep Fast Ur Hard Disk Read
Write Speed
Try
OPEN RUN
>TYPE CMD
>TYPE CHKDSK
PRESS ENTER




Q. How To Create Startup Repair Disk Window 7. ?
Go2: Start
>Contrl Panel
>Backup & Restore
>Create Startup Repair Disc
>Insert DVD




How to Disable Usb?
(1/2)
1.Click on Start
>Run
>Type Regedit
2.Goto
HKEY_LOCAL_MACHINE
>SYSTEM
>CurrentControlSet
>Services
>USBSTOR






Computer Memory:
*Bit
*Byte
*KiloByte
*MegaByte
*GigaByte
*TeraByte
*PetaByte
*Exabyte
*Zettabyte
*Yottabyte
*Brontobyte
*Geopbyte..
Enjoy




Shutting down 100 times faster:
>Press ctrl+alt+del
open task Manager
>click the shutdown Tab.
While holding ctrl key,
Press TURN OFF


Restoring a lost Desktop is simple now:
> Start
> Run Type a "period"
> Then press Enter.
U can do this to restore desktop.


Create a self extracting without any additional software package for your files.
* take run
* type "iexpress"
* create your own package


పాలిటీ - భారత రాజ్యాంగం




భారతదేశం రాష్ట్రాల కలయిక అంటే యూనియన్. ఏడో షెడ్యూల్ ప్రకారం కేంద్ర- రాష్ట్రాల మధ్య పాలనకు సంబంధించిన అధికారాలు విభజించారు. సమాఖ్య విధానాన్ని అనుసరించినప్పటికీ, రాజ్యాంగంలో సమాఖ్యకు బదులుగా యూనియన్ అనే పదాన్ని ఉపయోగించారు. బి.ఆర్. అంబేద్కర్ సూచన ప్రకారం కెనడా దేశ సమాఖ్యను ఆధారంగా తీసు కున్నారు. మన రాజ్యాంగంలో కూడా యూనియన్ అనే పదాన్ని వినియోగించారు. దీనికి ప్రధాన కారణం మన సమాఖ్య సూత్రబద్దం కాకపోవడమే. ‘సమాఖ్య’ పదానికి సమాన ఆంగ్ల పదం ‘ఫెడరేషన్.’ ఇది లాటిన్‌లోని ‘ఫోడస్’ అనే పదం నుంచి ఉద్భవించింది. ఫోడస్ అంటే ‘ఒప్పందం’ అని అర్థం. ఈవిధంగా ఏర్పడిన ప్రభుత్వానికి ఉత్తమ ఉదాహరణ అమెరికా సమాఖ్య. 1776లో అమెరికా స్వాతంత్య్రం పొందిన తర్వాత 1787లో రాజ్యాంగాన్ని రూపొందించుకునే నాటికి అమెరికాలోని 13 రాష్ట్రాల మధ్య కుదిరిన ఒప్పంద అవగాహనే అమెరికా సంయుక్త రాష్ట్రాలు. మనది అమెరికా వంటి సమాఖ్య కాదు.

ఒప్పంద ఫలితం కూడా కాదు. పాలనా సౌలభ్యం కోసం మాత్రమే రాజ్యాంగం ద్వారా కేంద్ర, రాష్ట్రాల మధ్య అధికారాలు పంపిణీ చేశారు. అందువల్ల ఏ విభాగానికి, రాష్ట్రానికి లేదా కేంద్రపాలిత ప్రాంతానికి మన దేశం నుంచి విడిపోయే అధికారం లేదు. పాలనా సౌలభ్యం కోసం మాత్రమే రాష్ట్రాల పునర్విభజన చేశారు.

రాష్ట్రాల విభజన:
రాష్ట్రాల పునర్విభజన సమయంలో కూడా పూర్తి అధికారం కేంద్ర ప్రభుత్వం అంటే పార్లమెంట్‌కు మాత్రమే ఉంది. రాష్ట్రాల పునర్ వ్యవస్థీకరణ సమయంలో రాష్ర్టపతి ఆ రాష్ర్ట శాసనసభ అభిప్రాయం తెలుసుకోవచ్చు. ఐతే శాసనసభ అభిప్రాయాన్ని కచ్చితంగా పాటించాల్సిన అవసరం కేంద్రానికి లేదు. కేంద్రం తన ఇష్టానుసారం నిర్ణయం తీసుకుంటుంది. రాజ్యాంగంలోని రెండో అధికరణ ప్రకారం దేశ భూభాగంపై ఎలాంటి నిర్ణయమైనా తీసుకొనే అధికారం పార్లమెంట్‌కు ఉంది.

1960లో బేరూబారి కేసులో మన భూభాగాన్ని ఇతరులకు బదిలీ చేసే సందర్భంలో, ఇతర భూభాగాలు మన దేశంలో విలీనం చేసే సందర్భంలోనూ రాజ్యాంగ సవరణల ద్వారా పార్లమెంట్ నిర్ణయం తీసుకోవాలనీ.. అంతర్గత భూ భాగంలో మార్పులు చేసే సందర్భంలో రాజ్యాంగ సవరణలు తప్పనిసరి కావని సుప్రీంకోర్టు తీర్పు ఇచ్చింది. ఈ తీర్పు ప్రకారం దేశంలోని భూభాగం విషయంలో, రాష్ట్రాల పునర్విభజన సమయంలోనూ నిర్ణయాధికారం కేంద్ర ప్రభుత్వానికే ఉంది.

రాజ్యాంగ నిర్మాతలు దేశ పరిస్థితులకు అనుగుణంగా సమాఖ్య వ్యవస్థను నిర్మించారు. ‘ఏ దేశం రాజ్యాంగమైనా నాటి పరిస్థితులను ప్రతిబింబిస్తుందని’ నెహ్రూ పేర్కొనడానికి ఎంతో ప్రాముఖ్యం ఉంది.

భారతదేశం స్వాతంత్య్రం పొందిన తర్వాత సొంత రాజ్యాంగాన్ని రూపొందించుకొనే సందర్భంలో దేశ విభజన కాలం నాటి పరిస్థితులు, శాంతి భద్రతల పరిరక్షణ, స్వదేశీ సంస్థానాలను విలీనం చేయడం.. వంటి అంశాలను దృష్టిలో ఉంచుకొని, కేంద్రంలో బలమైన ప్రభుత్వాన్ని ఏర్పాటుచేసే ఉద్దేశంతో ఏకకేంద్ర లక్షణాలను పొందుపర్చారు. భారతదేశ భిన్నత్వం, దేశ విశాల పాలనా పరిధి ఆధారంగా ఆంగ్లేయులు 1935 చట్టం ద్వారా ఫెడరల్ వ్యవస్థను పరిగణలోనికి తీసుకొని సమాఖ్య లక్షణాలు కూడా పొందుపర్చారు. దీంతో మన సమాఖ్య అర్ధ సమాఖ్యగా రూపొందిందని కె.సి.వేర్ పేర్కొన్నారు. అంబేద్కర్ ప్రకారం ‘దేశం సాధారణ పరిస్థితుల్లో సమాఖ్య వ్యవస్థగా, అత్యవసర పరిస్థితుల్లో ఏక కేంద్ర ప్రభుత్వంగా పని చేస్తుంది.’ అంటే దేశం ఏక కేంద్ర, సమాఖ్య లక్షణాల కలయికగా ఏర్పడింది.’

అధికారాల పంపిణీ:
రాజ్యాంగంలోని ఏడో షెడ్యూల్‌లో కేంద్ర -రాష్ర్ట ప్రభుత్వాల మధ్య అధికారాల పంపిణీకి సంబంధించిన జాబితా ఉంది.

కేంద్ర జాబితా: జాతీయ, అంతర్జాతీయ ప్రాముఖ్యం ఉన్న 97 అంశాలు కేంద్ర జాబితాలో పొందుపర్చారు. కొన్ని మార్పుల కారణంగా ప్రస్తుతం ఈ జాబితాలోని అంశాల సంఖ్య 100కు చేరింది. 92వ అధికరణలో అంత రాష్ర్ట వ్యాపార, వాణిజ్యానికి సంబంధించిన పన్ను; కన్‌సైన్‌మెంట్ టాక్స్‌తో పాటు సేవలపై పన్ను అనే అంశాలను చేర్చడంతో ప్రస్తుతం ఈ జాబితాలో 100 అంశాలు ఉన్నాయి.

రాష్ట్ర జాబితా: ప్రాంతీయ ప్రాముఖ్యం ఉన్న 66 అంశాలను రాష్ర్ట జాబితాలో పొందుపర్చారు. 1976లో 42వ రాజ్యాంగ సవరణ ద్వారా ఐదు అంశాలను రాష్ర్ట జాబితా నుంచి తొలగించి ఉమ్మడి జాబితాలో చేర్చారు. ప్రస్తుతం ఈ జాబితాలో 61 అంశాలు మాత్రమే ఉన్నాయి.
ఉమ్మడి జాబితా: ప్రాంతీయ ప్రాముఖ్యం ఉన్నప్పటికీ జాతీయ దృక్కోణం కూడా అవసరమైన 47 అంశాలను ప్రారంభంలో ఉమ్మడి జాబితాలో చేర్చారు.

ఐతే 1976లో రాష్ర్ట జాబితాకు చెందిన ఐదు అంశాలు ఉమ్మడి జాబితాకు బదిలీ చేశారు. దీంతో ఈ జాబితాలోని అంశాల సంఖ్య 52కు చేరింది. ఉమ్మడి జాబితా అనే భావనను ఆస్ట్రేలియా నుంచి గ్రహించారు. పైన పేర్కొన్న మూడు జాబితాల్లో చేరని అంశాలు, కొత్తగా వచ్చే అంశాలను అవశిష్ట అధికారాలు అంటారు. ఈ అధికారాలను కేంద్రానికి కేటాయించారు. ఈ విషయంలో కెనడాను అనుసరించారు. కేంద్ర, రాష్ర్ట ప్రభుత్వాల మధ్య అధికారాల పంపిణీ వల్ల కేంద్ర ప్రభుత్వ పరిధిని గురించి 73వ అధికరణ, రాష్ర్ట ప్రభుత్వ అధికార పరిధిని 162వ అధికరణలో పేర్కొన్నారు. అధికారాల పంపిణీ, పరిధిని రాజ్యాంగం ద్వారానే నిర్ణయించడం వల్ల మన రాజ్యాంగం లిఖిత పూర్వకమైంది.

రాజ్యంగ సవరణలు:
సమాఖ్య వ్యవస్థలో రాజ్యాంగం ద్రుఢంగా ఉంటుంది. కారణం అధికారాల పంపిణీ రాజ్యాంగం ద్వారా జరగడం వల్ల రాజ్యాంగంలో ఎలాంటి సవరణలు చేయాలన్నా కూడా భారత పార్లమెంట్ 2/3వ వంతు మెజారిటీతో ఆమోదించి, 1/2వ వంతు రాష్ట్రాలు ఆ బిల్లును ఆమోదించాలి. రాజ్యాంగంలోని సమాఖ్య లక్షణాల్లో ఏ మార్పు చేయాలన్నా ఈ పద్ధతినే ఉపయోగించాలి. రాజ్యాంగ సవరణలో రాష్ట్రాల ఆమోదం పొందే పద్ధతిని అమెరికా నుంచి గ్రహించారు.

రాజ్యాంగ పరిధికి లోబడే:
కేంద్ర-రాష్ర్ట ప్రభుత్వాలు, రాష్ట్రాలు-రాష్ట్రాల మధ్య తలత్తే వివాదాలను పరిష్కరించడంలో సుప్రీంకోర్టు కీలక పాత్ర పోషిస్తుంది. సుప్రీంకోర్టుకు స్వయంప్రతిపత్తి కల్పించారు. దేశంలో కేంద్ర-రాష్ర్ట ప్రభుత్వాలు రాజ్యాంగ పరిధిలోనే ఏర్పడి, రాజ్యాంగం ద్వారానే అధికారాలు పొంది, రాజ్యాంగ పరిధికి లోబడి తమ అధికారాలు నిర్వర్తిస్తాయి. ప్రభుత్వాల మధ్య తలెత్తే సమస్యలను రాజ్యాంగ పరిధికి లోబడే సుప్రీంకోర్టు పరిష్కరిస్తోంది. దాంతో మన దేశంలో రాజ్యాంగ ఆధిక్యత ఉన్నట్టు పేర్కొనొచ్చు.

జాతీయ, అంతర్జాతీయ ప్రాముఖ్యం ఉన్న అంశాలు కేంద్ర ప్రభుత్వం; ప్రాంతీయ ప్రాముఖ్యం ఉన్న అంశాలు రాష్ర్ట ప్రభుత్వాలు నిర్వర్తిస్తాయి. ఈ విధంగా రెండు స్థాయిల్లో ప్రభుత్వాలు పని చేస్తున్నాయి. సమాఖ్య విధానాన్ని అనుసరించే దేశాల్లో ఎగువ సభలు రాష్ట్రాలకు ప్రాతినిధ్యం వహిస్తున్నాయి. మన దేశంలో దిగువ సభ లోక్‌సభ ప్రజలకు, ఎగువసభ రాజ్యసభ రాష్ట్రాలకు ప్రాతినిధ్యం వహిస్తున్నాయి. భారతదేశం కూడా అన్ని సమాఖ్యల మాదిరిగానే మౌలిక లక్షణాలను కలిగి ఉంది. దేశ ప్రత్యేక పరిస్థితులను దృష్టిలో ఉంచుకొని మన సమాఖ్య విధానం రూపొందింది.

అమెరికా సమాఖ్యతో పోల్చితే..
ప్రపంచంలో వాస్తవ సమాఖ్యకు ఉదాహరణగా, ఆదర్శ సమాఖ్య దేశంగా అమెరికాను పేర్కొంటారు. ఎన్నో అంశాల్లో అమెరికాతో మన సమాఖ్య విభేదిస్తోంది. అమెరికా పౌరులకు ద్వంద్వ పౌరసత్వ ఉంది. భారతదేశంలో ఒకే పౌరసత్వ ఉంది. పౌరసత్వంలో మనం బ్రిటన్‌ను అనుసరించాం. అమెరికాలో అవశిష్ట అధికారాలను రాష్ట్రాలకు కేటాయిస్తే, మన దేశంలో అవశిష్ట అధికారాలను కేంద్ర ప్రభుత్వానికి కట్టబెట్టారు. ఈ విషయంలో కెనడాను అనుసరించాం.

అమెరికాలో కేంద్ర, రాష్ర్ట ప్రభుత్వాలకు వేర్వేరుగా రెండు రాజ్యాంగాలు ఉంటాయి. మన దేశంలో ఒకే రాజ్యాంగం ఉంది. న్యాయ వ్యవస్థ విషయంలో అమెరికాలో వికేంద్రీకరణ ఉంది. అక్కడ జాతీయ, రాష్ట్రాల న్యాయ వ్యవస్థలు వేర్వేరుగా ఉంటాయి. మన దేశంలో ఏకీకృత న్యాయ వ్యవస్థ ఏర్పాటు చేశారు. బ్రిటిష్ ప్రభుత్వ కాలంలో ప్రవేశపెట్టిన సమీకృత న్యాయవ్యవస్థనే మనం అనుసరిస్తున్నాం.

రాష్ట్రాలకు ప్రాతినిధ్యం వహించే ఎగువ సభల విషయం కూడా భారత్, అమెరికాల మధ్య భిన్నత్వం ఉంటుంది. అమెరికా సెనేట్‌లో మొత్తం 100 మంది సభ్యులుంటారు. వారంతా 50 రాష్ట్రాల నుంచి.. ఒక్కొక్క రాష్ర్టం నుంచి ఇద్దరు సభ్యుల చొప్పున ప్రాతినిధ్యం వహిస్తున్నారు. మన రాజ్యసభలో రాష్ట్రాలకు అసమాన ప్రాతినిధ్యం ఉంది.

ఉత్తరప్రదేశ్‌కు రాజ్యసభలో 31 స్థానాలు ఉంటే.. అస్సాంను మినహాయించి మిగిలిన ఏడు ఈశాన్య రాష్ట్రాలు, గోవా నుంచి ఒక్కో సభ్యునికే ప్రాతినిధ్యం ఉంది. వాస్తవిక సమాఖ్యలో చిన్న, పెద్ద రాష్ట్రాలకు ఒకే విధమైన ప్రాతినిధ్యం ఉంటుంది. మన దేశంలో దీని భిన్నంగా ఉంది. రాజ్యాంగ సవరణ విషయంలో కూడా భిన్నత్వం ఉంది. భారత రాజ్యాంగం ద్రుఢ, అద్రుఢ లక్షణాల కలయికతో రూపొందించినప్పటికీ, అద్రుఢ లక్షణాలే ఎక్కువగా ఉన్నాయి.


రాజ్యాంగంలోని అనేక అంశాలను సాధారణ మెజార్టీతోనే పార్లమెంటు సవరిస్తుంది. రాజ్యాంగ సవరణ విషయంలో రాష్ట్రాల చొరవకు అవకాశం లేదు. పార్లమెంటు చేసే రాజ్యాంగ సవరణల్లో మార్పులు చేసే అధికారం రాష్ట్రాలకు లేదు. అందువల్ల మన దేశాన్ని ‘బలమైన కేంద్రీకృత ధోరణుల సమాఖ్య వ్యవస్థగా’ సర్ ఐవర్ జెన్నింగ్‌‌స వర్ణించారు. అలెగ్జాండ్రో విజ్ మన దేశాన్ని ‘వాస్తవిక సమాఖ్యగానే’ పేర్కొన్నారు.


More Bits:
 http://studentandhara.blogspot.in/2012/12/blog-post_9966.html









Thursday, January 17, 2013

నేషనల్ ఫైర్ సర్వీస్ సబ్ ఆఫీసర్స్

Tags: Jobs In India



కేంద్ర హోంశాఖ పరిధిలోని నేషనల్ ఫైర్ సర్వీస్ కాలేజీ 36వ ఆలిండియా ఎంట్రన్స్ ఎగ్జామినేషన్ ఫర్ సబ్ ఆఫీసర్స్ కోర్సు నోటిఫికేషన్‌న్‌ను విడుదల చేసింది. అగ్నిప్రమాదాల నివారణ సమయంలో నిఫుణుల అవసరం ఉంటుంది. ఇందుకు నేరుగా నియామకాలే కాకుండా కళాశాలలో కోర్సు చేయడం ద్వారా కూడా నిపుణులను తయారు చేసుకోవడం ఈ కోర్సు ఉద్దేశ్యం. 2010-2011 సంవత్సరానికి నాగపూర్‌లోని ఫైర్ సర్వీస్ కాలేజీతో పాటు దాని కింద ఉన్న రీజనల్ ట్రైనింగ్ కాలేజీల్లో సబ్ ఆఫీసర్స్ కోర్సును అందించేందుకు ఈ ప్రవేశ పరీక్షను నిర్వహిస్తోంది. ఈ కోర్సు కాల వ్యవధి 33 వారాలు ఉంటుంది. 21 వారాలు కాలేజీ, ట్రైనింగ్ సెంటర్‌లలో జరిగితే, మిగిలిన 12 వారాలు ప్రాక్టికల్ ట్రైనింగ్ ఇస్తారు. ఈ ప్రవేశ పరీక్ష వచ్చే ఏడాది ఫిబ్రవరి 28న జరుగుతుంది. ఈ కోర్సు ఉందన్న విషయం చాలామందికి తెలీదు. ఫైర్ సర్వీస్ ఉద్యోగాలకు ఇటు ప్రభుత్వ, ప్రైవేటు రంగంలో కూడా మంచి డిమాండ్ ఉంది.
వయోపరిమితి: 2010 జులై 1వ తేదీ నాటికి 18 నుంచి 23 ఏళ్ళ మధ్య ఉన్న కలిగి ఉండాలి. పురుష, మహిళలు ఇరువురూ అర్హులే. ఎస్‌సి, ఎస్‌టి అభ్యర్ధులకు 5 ఏళ్ల వయోపరిమితి నిబంధనల ప్రకారం సడలింపు ఉంటుంది. వయోపరిమితి సడలింపు అర్హత ఉన్న వారు తమ వద్ద ఉన్న అర్హత ధృవీకరణ పత్రాలను సమర్పించాల్సి ఉంటుంది.
విద్యార్హతలు:
గుర్తింపు పొందిన బోర్డు లేదా సంస్ధ నుంచి హెచ్‌ఎస్‌ఎస్‌సి లేదా ఇంటర్మీడియట్ (10+2) ఉత్తీర్ణులై ఉండాలి. హిందీ, ఇంగ్లీషు చదవడం, రాయడం, మాట్లాడడం వచ్చి ఉండాలి.
శారీరక కొలతలు:
పురుషులు: ఎత్తు 165 సె.మీ తగ్గకుండా ఉండాలి. బరువు 50 కేజీలు తగ్గకుండా ఉండాలి. ఛాతీ గాలి పీల్చినప్పుడు 86 సె.మీ, పీల్చనప్పుడు 80 సె.మీ ఉండాలి. కంటిచూపు 6/6 కలర్ బ్లైండ్‌నెస్ ఉండకూడదు. మెడికల్‌గా ఫిట్ కావాల్సి ఉంటుంది.
మహిళలు: ఎత్తు 157 సెం.మీ కలిగి ఉండాలి. 46 కేజీల కన్నా బరువు తక్కువ ఉండకూడదు. కంటి చూపు పురుషుల మాదిరిగానే ఉండాలి.
దరఖాస్తులు పంపేందుకు ఆఖరి తేదీ :
దరఖాస్తును నోటిఫికేషన్‌లో పేర్కొన్న మాదిరిగా తయారు చేసుకుని 2010 జనవరి 11 నాటికి పంపించాల్సి ఉంటుంది. ఇప్పటికే ఫైర్ సర్వీస్‌లో పని చేస్తున్న అభ్యర్ధులైతే వారు తమ దరఖాస్తును ప్రోపర్ చానల్ ద్వారా పంపించాల్సి ఉంటుంది. జనవరి 11 తర్వాత అందిన దరఖాస్తులను తిరస్కరించడం జరుగుతుంది.
పరీక్ష ఫీజు:
అన్‌రిజర్వుడు అభ్యర్ధులు రూ.100, ఎస్‌సి, ఎస్‌టి అభ్యర్ధులు రూ.25 ఫీజు చెల్లించాలి. ఫీజును ఇండియన్ పోస్టల్ ఆర్డర్ రూపంలో పంపించాల్సి ఉంటుంది. డిమాండ్ డ్రాప్టులు గానీ, తక్కువగా గానీ, అసలు ఫీజు చెల్లించకుండా గానీ పంపితే అటువంటి దరఖాస్తులు తిరస్కరించబడతాయని అభ్యర్ధులు గ్రహించాలి.
ప్రవేశ పరీక్ష విధానం:
పరీక్ష రెండు విభాగాలుగా ఒకే రోజు జరుగుతుంది. ప్రశ్నపత్రం హిందీ, ఇంగ్లీషుల్లో ఉంటుంది. మొదటి విభాగం పేపర్‌లో ప్రశ్నలు పూర్తి ఆబ్జక్టివ్ పద్దతిలో ఇంటర్మీడియట్ స్ధాయిలో ఉంటాయి. ఈ పేపర్‌లో జనరల్ ఇంగ్లీష్, జనరల్ నాలెడ్జి ప్రశ్నలు ఉంటాయి. రెండో పేపర్‌లో జనరల్ సైన్స్, మేథమెటిక్స్ ఉంటాయి.
పరీక్ష కేంద్రాలు:
ప్రవేశ పరీక్ష కేంద్రాలు ముంబయి, న్యూఢిల్లీ, కోల్‌కత్తా, చెన్నై, నాగపూర్‌లో మాత్రమే జరుగుతాయి. దరఖాస్తులు అన్నీ పరిశీలించిన తర్వాత అర్హులైన వారికి మాత్రమే ప్రవేశ పరీక్ష రాసేందుకు కాల్ లెటర్లు అందుతాయి. కళాశాల అవసరార్ధం కోరుకున్న పరీక్షా కేంద్రాన్ని మార్చేందుకు అవకాశం ఉంటుంది.
సీట్ల వివరాలు:
నాగపూర్ నేషనల్ ఫైర్ సర్వీస్ కాలేజీలో 60 సీట్లు మాత్రమే ఉంటాయి. రెండు బ్యాచ్‌లుగా జరుగుతాయి. ఒక్కో బ్యాచ్‌కి 30 సీట్లు ఉంటాయి. వాటిలో 5 సీట్లు ఎస్‌సి, ఎస్‌టిలకు, మరో రెండు సీట్లను సర్వీస్‌లో ఉండి చనిపోయిన వారి పిల్లలకు కేటాయించబడతాయి. జులై 2010లో ఒక బ్యాచ్, 2011 జనవరిలో రెండో బ్యాచ్‌కి తరగతులు జరుగుతాయి. ఈ పరీక్షకు హాజరయ్యే అభ్యర్ధులకు ఎటువంటి టి.ఎ, డి.ఎలు ఇవ్వబడవు.
ప్రవేశం: కోర్సులోకి ప్రవేశించే అభ్యర్ధులు ప్రవేశ పరీక్షలో సాధించిన పూర్తి స్ధాయి ప్రతిభ ఆధారంగా ఉంటుంది. దీంతో పాటు మెడికల్‌గా పూర్తి ఫిట్‌నెస్ కలిగి ఉండాలి.
ఇతర వివరాలు: దరఖాస్తులను ఎ4 సైజులో మాత్రమే పంపించాల్సి ఉంటుంది. అన్ని వివరాలను పూర్తి చేయాల్సి ఉంటుంది. అభ్యర్ధులు తమ సంతకాన్ని నిర్ధేశించిన బాక్స్‌లో మాత్రమే చేయాల్సి ఉంటుంది. దరఖాస్తు ఫోటో కాపీ పంపిస్తే తిరస్కారానికి గురవుతుంది. దరఖాస్తులో అభ్యర్ధులు తమ సంతకాన్ని కేపిటల్ లెటర్‌లలో చేస్తే తిరస్కరించబడతాయి. దరఖాస్తుతో పాటు పంపిన అభ్యర్ధి ఫోటోపై కళాశాల ప్రిన్సిపాల్ లేదా, గెజిటెడ్ అధికారి సంతకం చేసి పంపించాల్సి ఉంటుంది. దరఖాస్తులను డైరక్టర్, నేషనల్ ఫైర్ సర్వీస్ కాలేజీ, సివిల్ లైన్స్, నాగపూర్-440001 చిరునామాకు పంపించాలి. దరఖాస్తు పంపించే కవర్‌పై ‘అప్లికేషన్ ఫర్ ఎంట్రన్స్ ఎగ్జామినేషన్ ఫర్ 36వ సబ్ ఆఫీసర్స్ కోర్సు-2009’ అని స్పష్టంగా రాసి పంపించాలి. ఎవరైతే అర్హులుగా కాలేజీ భావిస్తుందో వారికి మాత్రమే కాల్ లెటర్లు పంపించడం జరుగుతుంది. ఈ కోర్సు పూర్తిగా కళాశాలలో ఉండి మాత్రమే పూర్తి చేయాల్సి ఉంటుంది. బాలురు ఉండేందుకు వసతి సౌకర్యం ఉంది. కానీ మహిళా అభ్యర్ధులు తమ వసతికి సంబంధించిన ఏర్పాట్లు వారే చేసుకోవాల్సి ఉంటుంది. మెడికల్ చెకప్ సమయంలో అన్ని ఒరిజినల్ డాక్యుమెంట్లు, రెండు ఫోటో గ్రాఫ్‌లు తమ వెంట తెచ్చుకోవాల్సి ఉంటుంది. మిగిలిన వివరాలు, దరఖాస్తులు డౌన్ లోడ్ కోసం తీతీతీ.డ్ళ్ఘజూౄజఒఒజ్యశ.ష్యౄ సందర్శించవచ్చును.


టెన్త్ క్వాలిఫికేషన్‌తో కావచ్చు ఎక్సైజ్ కానిస్టేబుల్

టెన్త్ క్వాలిఫికేషన్‌తో కావచ్చు ఎక్సైజ్ కానిస్టేబుల్

కేవలం టెన్త్ ఉత్తీర్ణులై తమకు పెద్దగా ప్రభుత్వోద్యోగాలు రావడం లేదని ఆవేదన చెందుతున్న యువతీ యువకులకు శుభవార్త. రాష్ట్ర ఎక్సైజ్ శాఖ నుంచి
ఎక్సైజ్ కానిస్టేబుల్ నోటిఫికేషన్ వెలువడనున్నది. దాదాపు రెండు దశాబ్థాల అనంతరం 2606 ఖాళీలు భర్తీచేయనున్నారు.

టెన్త్ క్వాలిఫికేషన్‌గల యువతీ యువకులకు శుభవార్త. ప్రభుత్వ ఉద్యోగావకాశాలు టెన్త్ వారికి అరుదుగా వస్తున్న నేపథ్యంలో రాష్ర్ట ఎక్సైజ్ డిపార్ట్ మెంట్ కానిస్టేబుల్ పోస్టులకు పోటీపడే అవకాశం కల్పిస్తున్నది. ఏకంగా 18 ఏళ్ళ తర్వాత 2600 ఖాళీలను భర్తీ చేసేందుకు నోటిఫికేషన్ వెలువరించ నున్నది. ఈ అరుదైన అవకాశాన్ని టెన్త్ ఉత్తీర్ణులైన 10 లక్షల మంది ఉపయోగించుకునే అవకాశం ఉందని ఎక్సైజ్ శాఖ అంచనా వేస్తోంది.

ఎంపిక విధానం
తొలిదశ ః శారీరక సామర్థ్య పరీక్ష
-పురుష అభ్యర్థులు 4 కి.మీ.ల పరుగు పందెం 20 నిమిషాల్లో, మహిళలు 2 కి.మీ.ల పరుగుపందెం 1 నిమిషాల్లో పూర్తి చేయాలి. 100 మీటర్ల పరుగు పందెంను పురుషులు 15 సెకన్లు, మహిళలు 18 సెకన్లలో పూర్తిచేయాలి.
-హైజంప్ పురుషులకు 1.20 మీటర్లు. మహిళ లకు దీని నుంచి మినహాయించారు.
-లాంగ్‌జంప్ పురుషులకు 3.80 మీటర్లు. మహిళలు 2.75 మీటర్లలో అర్హత సాధించాలి.
-షాట్‌పుట్ (7.26 కిలోలు) పురుషులు 5.60 మీటర్లు, మహిళలు (4 కిలోలు) 4.5 మీటర్ల వరకు విసరాలి.
-పురుషులు 800 మీటర్ల పరుగుపందెంను 2.50 నిముషాల్లో పూర్తి చేయాలనే నిబంధన విధించారు.

మలిదశ ః రాత పరీక్ష
(100 మార్కులు - సింగిల్ పేపర్)
-జనరల్ స్టడీస్ ః 50 మార్కులు
-ఆప్టిట్యూడ్ టెస్ట్ ః 50 మార్కులు

ఫాస్ట్ ట్రాక్ ప్రవెూషన్స్
సివిల్ కానిస్టేబుల్ పోస్టులతో పోల్చుకుంటే 5-10 ఏళ్ళ ముందుగానే ఎక్సైజ్ కానిస్టేబుల్ ఉద్యోగ అభ్యర్ధులు హెడ్ కానిస్టేబుల్‌గా పదోన్నతి పొంద వచ్చు. రాష్ర్ట పోలీసు శాఖలో 50 వేల మంది కానిస్టేబుళ్ళు విధులు నిర్వర్తిస్తున్నారు. అదే ఎక్సైజ్ డిపార్ట్‌మెంటులో కేవలం 5 వేల మంది కానిస్టేబుల్స్‌గా పనిచేస్తున్నారు. సీనియారిటీ ప్రాతిపదికన పదోన్నతులు కల్పించే ప్రక్రియలో ఎక్కువ సిబ్బంది ఉన్న చోట ఆలస్యంగా పదోన్నతులు లభిస్తుంటాయి. అదే తక్కువ సిబ్బంది ఉన్నచోట త్వరితగతిన పదోన్నతులు అందు తుంటాయి. ఈ నేపథ్యంలో ఎక్సైజ్ కానిస్టేబుల్‌గా ఎంపికైన 20 ఏళ్ళ యువకుడు 38 ఏళ్ళకు తన కెరీర్ ప్రస్థానంలో హెడ్ కానిస్టేబుల్, ఎక్సైజ్ సబ్ ఇన్‌స్పెక్టర్, ఎక్సైజ్ ఇన్‌స్పెక్టర్, అసిస్టెంట్ ఎక్సైజ్ సూపరిండెంట్ స్థాయి వరకు పదోన్నతులు పొందుతూ కీలక స్థానాలకు చేరుకునే అవకాశం ఉంది.

రూ. 30 వేల కోట్ల ఆదాయం
రాష్ర్టంలో మధ్యం సరఫరా నియంత్రణ, ప్రత్యేక విధులు నిర్వర్తించే ఎక్సైజ్ డిపార్ట్‌మెంటు ఏటా రాష్ర్ట ప్రభుత్వానికే 30 వేల కోట్లు ఆర్జించి పెడుతోంది. రాష్ర్ట ప్రభుత్వ అనేక విభాగాలలో రెవెన్యూ డిపార్ట్‌మెంట్లు కీలకమైనవిగా గుర్తించటం అనాదిగా వస్తోంది. ఎక్సైజ్ డిపార్ట్‌మెంటు రెవెన్యూ శాఖల పరిధిలోకి వస్తుంది. రాష్ర్టప్రభుత్వానికి ఏటా ‘బంగారు కోడిపెట్ట’లా బంగారుగుడ్లు పెట్టే నాలుగైదు డిపార్ట్‌మెంట్లు ఉన్నాయి. అవి కమర్షియల్ టాక్స్ డిపార్ట్‌మెంటు, ఎక్సైజ్ డిపార్ట్‌మెంటు , ట్రాన్స్‌పోర్టు డిపార్ట్‌మెంటు, స్టాంప్స్ అండ్ రిజిస్ట్రేషన్ డిపార్ట్‌మెంటు, గనుల శాఖ వంటివి ఉన్నాయి. రూ.50 వేల కోట్లు అందించే కమర్షియల్ టాక్స్ డిపార్ట్‌మెంటు తర్వాత రూ.30 వేల కోట్లు అందించి రెండోస్థానంలో నిలబడిన డిపార్ట్‌మెంటు ఎక్సైజ్.

ఎక్సైజ్ కానిస్టేబుల్ విధులు
రాష్ర్టవ్యాప్తంగా 324 ఎక్సైజ్ పోలీసు స్టేషన్లు ఉన్నాయి. ఎక్సైజ్ పోలీసుస్టేషన్‌కు ఉన్నతాధికారిగా ఎక్సైజ్ సర్కిల్ ఇన్‌స్పెక్టర్ వ్యవహరిస్తుంటారు. ఎక్సైజ్ స్టేషన్‌లో సి.ఐ.కు దిగువన ఎక్సైజ్ సబ్‌ఇన్‌స్పెక్టర్ ఉంటారు. ఎక్సైజ్ సర్కిల్ ఇన్‌స్పెక్టర్ లేదా ఎక్సైజ్ సబ్ ఇన్‌స్పెక్టర్ నేతృత్వంలో అక్రమ మద్యం సరఫరా స్థావరాలపై దాడులు చేసే క్రమంలో ఎక్సైజ్ కాని స్టేబుల్స్ నిర్దేశిత విధుల్లో పాల్గొనాల్సి ఉంటుంది. అక్రమ సారా తయారీ, కల్తీకల్లు తయారీ, గంజాయి మొక్కలు పెంపకం, వైన్‌షాపులలో మద్యం అమ్మకాలు వంటి వేర్వేరు నిషేదిత, ఆవెూదిత కార్యక్రమాలు సజావుగా జరుగుతున్నాయా లేదానేది ప్రాథమిక సమాచార సేకరణలో ఎక్సైజ్ కానిస్టేబుల్స్ కీలక బాధ్యతలు చేపట్టాల్సి ఉంటుంది. ఉద్యోగ బాధ్యతలు చేపట్టే క్రమంలో సివిల్ డ్రెస్, యూనిఫాం డ్రెస్‌తో ఎక్సైజ్ కానిస్టేబుల్స్ విధులు చేపట్టాల్సి ఉంటుంది.

జిల్లా స్థాయి పోస్టులు

postes
జిల్లా పరిధిని కేంద్రంగా చేసుకుని ఎక్సైజ్ కానిస్టేబుల్ ఉద్యోగాల భర్తీ చేపట్టారు. జిల్లాలో ప్రకటించే మొత్తం ఉద్యోగ ఖాళీలలో 80 శాతం పోస్టులు స్థానికులకు రిజర్వ్ చేస్తారు. రాత పరీక్షలో పోటీపడిన స్థానిక అభ్యర్ధులలో ఎవరైతే అత్యధిక మార్కులు స్కోర్ చేస్తారో వారితో 80 శాతం కాని స్టేబుల్ పోస్టులు భర్తీ చేస్తారు. సదరు జిల్లాలో 4 నుంచి 10వ తరగతి వరకు అత్యధిక సంవత్సరాలు పాఠశాల విద్యనభ్యసించిన అభ్యర్ధులను స్థానికంగా గుర్తిస్తారు. ఇక మిగతా 20 శాతం ఖాళీలలో రాత పరీక్షకు పోటీపడిన జిల్లాస్థానికులు లేదా ఇతర జిల్లాలు స్థానికేతర అభ్యర్ధులు ఎవరైతే అత్యధిక మార్కులు సాధిస్తారో వారిని ఎక్సైజ్ కానిస్టేబుల్ పోస్టులకు ఎంపిక చేస్తారు. ముందుగా 20 శాతం ఖాళీలు భర్తీ చేసి, ఆ తర్వాత 80 శాతం ఎక్సైజ్ కానిస్టేబుల్ పోస్టులు భర్తీ చేస్తారు.

హౌటు ప్రిపేర్ ?
రాతపరీక్ష సిలబస్ ః 10వ తరగతి స్థాయి
ఆబ్జెక్టివ్ టైప్ ః 100 ప్రశ్నలు

1. భారతదేశ చరిత్ర, భారతీయ సంస్కృతి, భారత జాతీయోద్యమం.
2. ఇండియన్ జాగ్రఫీ, పాలిటీ మరియు ఎకానమీ.
3. జనరల్ సైన్స్
4. జాతీయ మరియు అంతర్జాతీయ ప్రాముఖ్యత యొక్క కరెంట్ ఈవెంట్స్
5. అర్థమెటిక్
6. టెస్ట్ ఆఫ్ రీజనింగ్/మెంటల్ ఎబిలిటి
7. జనరల్ ఇంగ్లిష్

సిలబస్ ఏమిటి?
ఎలాంటి ప్రశ్నలడుగుతారు?

నూతన పరీక్షావిధానంలో ప్రశ్నల స్థాయి 10వ తరగతి లోపునే ఉంటుంది. ప్రశ్నలసంఖ్య తక్కువగా ఉన్నప్పటికీ సిలబస్ పరిధి మాత్రం ఎక్కవగానే ఉంటుంది. నూతన సిలబస్‌ను ఒక్కొక్క విభాగం నుండి ఎలాంటి ప్రశ్నలు ఇవ్వవచ్చో విపులంగా తెలుసుకుందాం...

భారతదేశ చరిత్ర
ఈ విభాగాన్ని వివరంగా పరిశీలిస్తే భారతదేశ చరిత్రలో మూడు భాగాలుంటాయి. అవి ప్రాచీన, మధ్యయుగ, ఆధునిక చరిత్ర. హరప్పా నాగరికతా కాలం నుంచి ప్రారంభమై వేదయుగం, మౌర్యులు, గుప్తుల కాలం నాటి సాంఘిక, రాజకీయ, ఆర్థిక, మత పరిస్థితులు, అనంతరకాలంలో భారతదేశానికి అడుగిడిన అరబ్బులు, టర్కులు తరువాత మొఘల్ సామ్రాజ్య ఏలుబడిలో మారిన భారత రాజకీయ చిత్రపటం, భిన్న సంస్కృతుల మేళవింపు. ఇదే సమయంలో దక్షిణాదిన వెలుగు వెలిగిన బహమనీలు, విజయనగర రాజుల వరకు అదే కాలంలో వాణిజ్య ప్రయోజనాల దృష్ట్యా భారతదేశానికి అడుగిడిన శ్వేతజాతి ఆంగ్లేయులు, అనంతర కాలంలో భారతదేశ రాజకీయ ఆధిపత్యాన్ని కైవసం చేసుకోవడం వరకు జరిగిన సంగ్రామం, విదేశీయుల దాస్య శృంఖలాల నుంచి విముక్తి పొందటానికి భారతజాతి పోరాటం వరకు, ఇదే కాలంలో సామాన్య ప్రజల నాయకుడైన గాంధీజీ అహింస, సత్యా గ్రహాన్ని ఆయుధంగా దేశ స్వాతంత్య్రం తెప్పించడం వరకు గల అంశాలుంటాయి.




Followers